శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న “అమర్ అక్బర్ అంటోనీ” ప్రమోషన్స్ లో వేగం పుంజుకుంది. టీజర్ తో మొదలైన ఈ ప్రమోషన్స్ లో తాజాగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇటీవల కాలంలో ఎస్.ఎస్.థమన్ ఎంత అద్భుతమైన ఫాంలో ఉన్నారో అని చెప్పడానికి నిదర్శనమే ఈ పాటగా పేర్కొనవచ్చు.
‘అరవింద సమేత’లో ‘పెనివిటి’ సాంగ్ తో ఎలా అయితే ప్రేక్షకులను సమ్మోహితులను చేసారో, ఈ “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాలో ఈ పాటను అంత సూపర్ హిట్ రేంజ్ లో స్వరపరిచారు థమన్. హీరోయిన్ ఆలపించే ఈ విరహ గీతానికి హరిణి స్వరం ఆహ్లాదకరంగా ఉంది. అలాగే ఇలాంటి విరహ వేదన పాటలకు కూడా తన కలానికి ఉన్న పవర్ ఏమిటో నిరూపించుకునే విధంగా రామ్ జో లిరిక్స్ ఉన్నాయి.
‘నువ్వే కావాలి, నువ్వే నువ్వే’ వంటి సినిమాల సమయంలో ఇలాంటి విరహ వేదన పాటలు దాదాపుగా ప్రతి సినిమాలో ఉండేవి. కానీ రానూ రానూ ఇలాంటి పాటలు తగ్గిపోవడం, ఒకటి, రెండు వచ్చినా అవి గుర్తుండిపోయేలా లేకపోవడంతో ప్రేక్షకుల ఆదరణ కరువైంది. కానీ “అమర్ అక్బర్ అంటోనీ” కోసం థమన్ అందించిన ఈ పాట మాత్రం ప్రేక్షకులు గుర్తుండిపోయేలా అందించాడు.