సెకండ్ ఇన్నింగ్స్ లో హీరో రాజశేఖర్ కేరీర్ కి మిక్సడ్ స్టార్ట్ వచ్చింది. గరుడవేగతో హిట్ కొట్టినా ఆ తరువాత వచ్చిన కల్కి నిరాశపరచింది. ఇప్పుడు తన తదుపరి చిత్రానికి తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ చిత్రానికి ఆల్రెడీ స్ర్కిప్ట్ వర్క్ పూర్తయింది. తమిళ దర్శకుడు, ప్రముఖ మాటల రచయిత జాన్ మహేంద్రన్ స్క్రిప్ట్ వర్క్ చేసిన టీమ్కి నేతృత్వం వహించారు. అక్టోబర్లో సినిమా షూటింగ్ మొదలుపెట్టె ప్రయత్నాలలో ఉన్నారు.
ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన అమలా పాల్ ని కథానాయకిగా తీసుకుంటున్నారని సమాచారం. గతంలో ఆమె రామ్ చరణ్ సరసన నాయక్ సినిమాలో నటించింది. పెళ్లి తరువాత ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇటీవలే విడాకుల తరువాత తిరిగి సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్ హీరోయిన్ పాత్రలు చేయడం తగ్గించేసింది. 3 పాటలు, 2 ముద్దుసీన్లు టైపు పాత్రలు ఒప్పుకోవడం లేదు. దీనితో ఈ స్క్రిప్ట్ లో విషయం ఉందనే అనుకోవాలి.
దర్శకుడు ప్రదీప్ విజయ్ ఆంటోనీ హీరోగా ‘భేతాళుడు’కు దర్శకత్వం వహించారు. అలాగే, తెలుగు హిట్ ‘క్షణం’ను తమిళంలో సత్యరాజ్ కుమారుడు శిబి సత్యరాజ్ హీరోగా ‘సత్య’ పేరుతో రీమేక్ చేశారు. హైదరాబాద్, చెన్నైలో చిత్రీకరణ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. సింగిల్ షెడ్యూల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్. మరి ఈ సినిమాతో రాజశేఖర్ మరో హిట్ సంపాదిస్తారో లేదో చూడాలి. అలాగే అమలా పాల్ కూడా తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తుంది.