వివాహం జరిగిన ఏడాదికే మనస్పర్థల కారణంగా మార్చి నుండి వేరుగా ఉంటున్న నటి అమలా పాల్, దర్శకుడు విజయ్ ఆనంద్, ఇక తమ వివాహ బంధానికి తెరవేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. విడాకుల కోసం ఇరువురూ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి న్యాయమూర్తి ముందు హాజరై, తమకు విడాకులు మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు.
అయితే, కోర్టులో ఈ తంతు ముగిసిన అనంతరం బయటకు వస్తూ హీరోయిన్ అమలాపాల్ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన కన్నీళ్లు పెట్టుకోవడం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విడాకులు తీసుకుంటున్న సందర్భంగా భర్త నుంచి భరణం లాంటిదేమీ కోరకపోవడం గమనార్హం. ఇద్దరి ఒప్పందంతో విడాకులు దాఖలు చేసుకోవడంతో, త్వరగానే వీరికి విడాకులు మంజూరు కావచ్చని న్యాయవాదులు అంటున్నారు.