Allu Arjun is my top priorityస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప జూలై మొదటి వారంలో షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. బాలీవుడ్ లో పలు సినిమాలతో ముంబైలో చాలా బిజీగా ఉన్న రష్మిక పుష్పకు బల్క్ డేట్స్ కేటాయించింది. జూలై 7 నుండి ఆమె పుష్ప షూటింగ్ కు హాజరవుతుంది. ఒక నెల పాటు కంటిన్యూ గా ఈ సినిమా కోసం షూట్ చేస్తుంది.

ఆమె సినిమాలోని తన భాగాలను దాదాపుగా పూర్తి చేసి, తన ఇతర ప్రాజెక్టుల కోసం తిరిగి ముంబైకి వెళుతుంది. ఈ చిత్రంలో నటి వెల్లటూరు అమ్మాయిగా కనిపించనున్నది . ఆమె ఇంతకు ముందు కార్తీ సుల్తాన్ లో దీనికి దగ్గరగా ఉండే ఒక పాత్ర పోషించింది. కానీ పుష్ప లోని ఆమె పాత్ర మరింత ఇంటెన్స్ గా ఉంటుందని సమాచారం.

ఈ చిత్ర నిర్మాతలు (మైత్రి మూవీ మేకర్స్) ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సుమారు 250-270 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, ఇది భారతీయ సినిమాల్లో అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటిగా ఉంటుంది. పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుంది. దసరా నాటికి కోవిడ్ పరిస్థితి బాగుంటే మొదటి భాగం దసరా సెలవులలో విడుదల అవుతుంది.

అప్పటికి 100% ఆక్యుపెన్సీని అనుమతించినట్లయితే మాత్రమే విడుదల జరుగుతుంది. ఇక రెండో భాగం షూటింగ్ మొదలుపెట్టే ముందు ఐకాన్ అనే సినిమా పూర్తి చేస్తాడు అల్లు అర్జున్. అయితే రెండో భాగానికి సంబంధించిన 10% షూటింగ్ ఇప్పటికే పూర్తి చేశారట.