allu sirish - Chandrababu naidu - Twitterఆంధ్రప్రదేశ్ అభివృద్దే లక్ష్యంగా పాటుపడుతున్న చంద్రబాబు, తనను వెనక్కి లాగుతున్నాడంటూ ప్రతిపక్ష నేత జగన్ ను ఎంతగా విమర్శిస్తారో, తను చేసే పనిని గుర్తిస్తే, స్థాయితో నిమిత్తం లేకుండా అభినందనలు తెలుపుతారని తాజాగా అల్లు శిరీష్ విషయంలో తెలిసింది. ‘ఉద్దానం కిడ్నీ బాధితుల శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కృషిని ప్రశంసిస్తూ’ చంద్రబాబు ట్వీట్ చేసారు.

ఈ ట్వీట్ కు స్పందించిన అల్లు శిరీష్… “రాజకీయాల కంటే ప్రజా సంక్షేమానికే నాయకులు ఎక్కువ విలువ ఇస్తున్నారని… ఇది ఎంతో గొప్ప విషయమని… నేషన్ ఫస్ట్…” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ మెగా హీరో ట్వీట్ ను గుర్తించిన చంద్రబాబు… ‘థాంక్యూ శిరీష్… చాలా గొప్పగా చెప్పావు… ప్రజలే ప్రధానం అనేదే మన మంత్రం. ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని ఇలాగే కొనసాగిస్తాం…’ అంటూ ప్రతిస్పందించారు.

దీనికి అల్లు శిరీష్ మళ్లీ రిప్లై ఇస్తూ… ‘తన ట్వీట్ కు స్పందించినందుకు ధన్యవాదాలు’ తెలిపారు. మెగా కాంపౌండ్ కు చెందిన హీరో కావడంతో, సోషల్ మీడియాలో ఈ ట్వీట్స్ వైరల్ అయ్యాయి. రాబోతున్న ఎన్నికలలో మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తుందన్న సంకేతాలను అల్లు శిరీష్ ఇప్పటి నుండే ప్రజలలో కలిగించడానికే పరోక్షంగా ఇలా స్పందించారా? అన్న చర్చలు జరుగుతున్నాయి.