Allu_Arjunస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమా గురించి ఇంకా ఫైనల్ కాల్ తీసుకోలేదు. ఈ ప్రాజెక్టు కోసం బోయపాటి శ్రీను, ఎఆర్ మురుగదాస్, శ్రీరామ్ వేణు, ప్రశాంత్ నీల్, వంటి అనేక పేర్లు ఇటీవలే కాలంలో మనం వింటున్నాం. ఈ దర్శకులందరూ ఏదో ఒక సమయంలో ఈ ప్రాజెక్టు కోసం అనుకున్న వారేనట.

కాని ఇప్పుడు ఇద్దరు మాత్రమే రేసులో ఉన్నారు. రేస్ లో ఇప్పుడు బోయపాటి శ్రీను, శ్రీరామ్ వేణు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నారు. బోయపాటి శ్రీను గతంలో వారి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు వంటి మరో పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాస్తున్నారట. మరోవైపు.. శ్రీరామ్ వేణు గతంలో ప్రకటించిన ఐకాన్ స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నారట.

పుష్ప తర్వాత అల్లు అర్జున్ ని దర్శకత్వం వహించే అవకాశం ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరికి దక్కుతుందో చూడాలి. పుష్పను రెండు భాగాలుగా తయారు చేస్తున్నారు. మొదటి భాగం ఈ సంవత్సరం మరియు రెండవ భాగం వచ్చే ఏడాది విడుదల అవుతుంది. కాబట్టి, # AA21 2022 రెండవ భాగంలో సెట్స్ మీదకు వెళ్తుంది.

కరోనా మహమ్మారి కారణంగా ఇంకా ఆలస్యం కూడా కావచ్చు. కాబట్టి, అల్లు అర్జున్ కు ఒక దర్శకుడిని వెంటనే లాక్ చేయటానికి ఆతృత లేదు. పుష్ప భారీ హిట్ అయితే అప్పుడు పరిస్థితులు మారిపోనూ వచ్చు. కాబట్టి ఇంత తొందరగా అల్లు అర్జున్ తన తదుపరి చిత్ర దర్శకుడిపై నిర్ణయం తీసుకోకపోవచ్చు.