Allu Arjun - Trivikram -Srinivasఅల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఈయన చేస్తున్న సినిమా ఇది. అరవింద సమేత సినిమాతో పర్లేదనిపించిన మాటల మాంత్రికుడు.. ఈ సారి తన సత్తా చూపించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40% పూర్తి అయ్యింది. ఒక కొత్త షెడ్యూల్ కోసం రేపు తూర్పు గోదావరి వెళ్లనున్నది చిత్ర బృందం. అక్కడి కాకినాడ పోర్టులో పది రోజుల పాటు ఒక భారీ ఫైట్ చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.

పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’లో సినిమాలో కథానాయిక నటించింది. ఇంకోవైపు బన్ని హీరోగా నటించిన ‘డీజే’ లో కథానాాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్‌తో నటించిన ఈ సినిమాతోనే కథానాయికగా పూజా హెగ్డే దశ తిరిగింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్‌గా వరుస అవకాశాలను తీసుకొచ్చింది. థమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ రెండు సినిమాల పాటలు పెద్ద హిట్ అయ్యాయి. అయితే దేవి ఈ మధ్య ఫార్మ్ లో లేకపోవడంతో తమన్ ను తీసుకుంది చిత్రబృందం. దీనితో తమన్ పై ఎక్కువ బాధ్యత ఉంది. మరోవైపు ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండబోతుందని, దానికోసం కాజల్ ను తీసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.