allu arjun rakul preeth singh sarainoduసినిమాలో ఒకే ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిన “సరైనోడు” చిత్ర యూనిట్, ఆ ఒక్క పాటను చిత్రీకరించడానికి ఉత్తర అమెరికాలోని బోలివాయోను చేరుకున్నారు. ఈ పాటతో ఈ సినిమా షూటింగ్ కు పేకప్ చెప్పనుంది చిత్ర యూనిట్. దీంతో చివరి సారిగా “సరైనోడు” మేకప్ వేసుకోవడానికి సిద్ధమైన హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రకుల్ ప్రీత్ లతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా యూనిట్ సభ్యులు ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. యస్.యస్.తమన్ సంగీతం అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం హైలైట్ అయిన ఈ టీజర్ యూ ట్యూబ్ లో రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. అన్ని అనుకూలిస్తే… సినిమా విడుదల తర్వాత కూడా బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా “సరైనోడు” నిలబడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో ఆడియో, ఏప్రిల్ లో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.