Allu-Arjun,-Unrelenting-And-Going-For-Killస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి, పుష్పా – పాన్-ఇండియా ప్రాజెక్ట్ కానుండడంతో 35 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నటుడు అల వైకుంఠపురములో కోసం 25 కోట్లు వసూలు చేశాడు.అయితే రెమ్యూనరేషన్ తగ్గించమని మేకర్స్ అతనితో త్వరలో చర్చలు జరుపుతారు కాబట్టి నటుడికి ఆనందం తొందరగానే ఆవిరైపోయింది.

“ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఆర్థిక మందగమనం ఉంటుందని అంచనా. దీనితో బడ్జెట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా చిత్రం అన్ని బాషలలో ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు కూడా తక్కువే. కాబట్టి, రెమ్యూనరేషన్ తగ్గించుకోక తప్పదు” అని చిత్రబృందంలోని ఒకరు మనకు చెప్పారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. శేషచలం అడవుల్లో ఎర్ర చంద్రనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ చిత్రం ఉన్నట్లు చెబుతున్నారు. రేష్మిక మందన్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ సరసన నటిస్తుంది. తూర్పు గోదావరిలోని మరేడుమిల్లి అడవులలో పుష్పా విస్తృతంగా షూటింగ్ జరుపుకుంటుంది.

పుష్పా సమ్మర్ కి విడుదల చెయ్యాలని ఆలోచన చేస్తున్నారు. అయితే కరోనా బ్రేక్ వల్ల అది కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ బ్రేక్ ను బన్నీ పుష్పా క్యారెక్టర్ కోసం తయారు కావడానికి వాడుకుంటున్నాడు. అలాగే ఈ చిత్రం లో చిత్తూరు యాసలో మాట్లాడాల్సి రావడంతో ఆ యాసకు సంబంధించిన క్లాసులకు కూడా వెళ్తున్నాడు బన్నీ.