Allu Arjun met his fan who came walking for over 200 kms (1)కొన్ని రోజుల క్రితం మాచర్ల గ్రామం కమ్మం పాడు నుండి హైదరాబాద్ కు పాదయాత్రగా తన అభిమాన నటుడు అల్లు అర్జున్ ని చూడటానికి నాగేశ్వరరావు అనే యువకుడు వస్తున్నాడని వార్తలు వచ్చిన విషయం విదితమే. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంట‌నే త‌న‌ని ఆపి హైద‌రాబాద్ కి తీసుకురమ్మ‌ని చెప్పారు. చివరికి హైద‌రాబాద్ చేరుకున్న తరువాత గానీ అతను అల్లు అర్జున్ టీమ్ కు దొరకలేదు.

నిన్న సాయంత్రం వారు అల్లు అర్జున్ కి క‌లిపించ‌డం జ‌రిగింది. అల్లు అర్జున్ నాగేశ్వరావుని క‌లిసి యెగ‌క్షేమాలు క‌నుక్కున్నారు. రొజుకు 35 కిలోమీట‌ర్ల నుండి 40 కిలొమీట‌ర్లు న‌డిచాను.. అది కూడా చెప్పుల‌తో న‌డిచాను అని చెప్ప‌గానే ఒక్క క్ష‌ణం అల్లు అర్జున్ క‌ల్లు చెమ‌ర్చాయి. అయితే ఇక ముందు ఎప్పుడు అటువంటి పనులు చెయ్యవద్దని అతనికి గట్టిగా చెప్పాడు అల్లు అర్జున్.

“ఇలాంటివి మీ భ‌విష్య‌త్తు కొసమో మీ ఫ్యామిలి కొస‌మో చేస్తే అప్పుడు నెను చాలా గ‌ర్వం గా చెప్పుకుంటాను. ద‌య‌చేసి మ‌రొక్క‌సారి ఇలా చెయ్యాలి అనుకుంటే మాత్రం నీకొసం, నీ ఫ్యామిలి కొసం చెయ్యి,” అంటూ త‌న అభిమానికి అల్లు అర్జున్ గుర్తుగా మొక్కని గిఫ్ట్ గా ఇచ్చారు. అంతే కాదు త‌న‌కి AA మాస్క్ లు కూడా ఇచ్చారు.

త‌న‌కి వీలున్న‌ప్పుడల్లా అభిమానుల్ని క‌లిసే ప్ర‌య‌త్నం చేస్తాను కాని ఇలా చేయ‌టం మంచిది కాదు మీ ఎఫ‌ర్ట్ అంతా మీ భ‌విష్య‌త్తు కొసం పెట్టండి అనేది నా మాట అని అభిమానిని క్షేమంగా పంపించారు. అల్లు అర్జున్ మాట్లాడిన విధానానికి, తనను రిసీవ్ చేసుకున్న తీరుకు ఆ యువకుడు మంత్రముగ్ధుడు అయ్యాడట.