Allu Arjun JrNTRమాస్ సెన్సేషన్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తన కెజిఎఫ్ 2 విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. అతను ఇప్పటికే తన తదుపరి చిత్రం, ప్రభాస్‌తో సలార్ అనే చిత్రం షూటింగ్ ప్రారంభించాడు. నీల్ మొన్న ఆ మధ్య అల్లు అర్జున్‌ను హైదరాబాద్‌లోని కార్యాలయంలో కలిశాడు, కాని ఆ చిత్రం ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు.

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కు చాలా ముందుగానే ఒక లైన్ ని వివరించాడు కానీ దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వెయిటింగ్ లో పెట్టాడు ఎన్టీఆర్. అయితే ఎప్పుడైతే నీల్ అల్లు అర్జున్ ని కలిశాడో ఎన్టీఆర్ అప్రమత్తమై, ఆ దర్శకుడికి కాదనలేని రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చాడని సమాచారం. ప్రశాంత్ నీల్ వెంటనే ఈ చిత్రానికి సంతకం చేశాడు.

ఆ చిత్రం #NTR31 ప్రకటన ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజున జరిగింది. ఈ చిత్రం 2022 రెండవ భాగంలో అంతస్తుల్లోకి వెళ్లి 2023 లో విడుదల అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో సాఫ్ట్ సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు మాస్ మీద దృష్టి పెట్టాడు. పుష్ప తరువాత ప్రశాంత్ నీల్ సినిమా పడితే మాస్ లో తన స్థానం పదిలం చేసుకోవచ్చు అని అంచనా వేశాడు.

అయితే ఆ అవకాశం ఎన్టీఆర్ తన్నుకుపోయాడు. అందుకు విరుగుడుగా దర్శకుడు బోయపాటి శ్రీను ఒక పూర్తి మాస్ మసాలా సబ్జెక్టు రాయమని చెప్పాడట అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్ కు సరైనోడు వంటి సరైన మాస్ సినిమాను ఇచ్చాడు బోయపాటి. ఆ సమయంలో సరైనోడు అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.