Allu Arjun about metoo‘మీటూ’ అంటూ అనేక మంది ప్రముఖులు, సినీ హీరోయిన్లు తమపై జరిగిన అన్యాయాలను, తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ సంచలనం సృష్టిస్తుండగా, తాజాగా అల్లు అర్జున్ ‘మీటూ’పై స్పందించారు. ‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ ప్రియాంకా గురించి ప్రస్తావించిన సమయంలో ‘మీటూ’పై తనదైన శైలిలో స్పందించారు ఈ స్టైలిష్ స్టార్.

“ఉన్న అన్ని ఇండస్ట్రీలలో టాలీవుడ్ ఈజ్ ది క్లీనెస్ట్ సినీ ఇండస్ట్రీ” అని చెప్పిన బన్నీ, తెలుగు అమ్మాయిలు నిరభ్యంతరంగా ఇండస్ట్రీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మహిళలకు ఇచ్చే గౌరవం ఏ ఇండస్ట్రీలో ఇవ్వరని, అందుకే ఇతర ఇండస్ట్రీల నుండి వచ్చిన హీరోయిన్లు, ‘తమకు ఇక్కడ బాగా గౌరవం లభిస్తోందని’ చెప్పుకుంటుంటారని, నేను చెప్తున్నాను… తెలుగు అమ్మాయిలు రావాలని అన్నారు.

మరాఠీ పిల్ల అయిన ప్రియాంకా అనంతపురంలో పెరిగిందని తెలిసిందని, ఎవరైనా తెలుగు మీద అభిమానం చూపిస్తే వారు తెలుగు వారేనని, ప్రియాంకా గురించి తాను కొన్ని విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోయానని చెప్పిన బన్నీ, తనకు నా మీద క్రష్ ఉందని చెప్పిందని, అయితే ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం అంటూ వేడుక మీద నవ్వులు పూయించారు స్టైలిష్ స్టార్.