alla-ramakrishna-supreme-court-india‘టార్గెట్ చంద్రబాబు’ లక్ష్యంగా చేసుకున్న వైసీపీ కదుపుతున్న అనేక వ్యూహాలలో భాగంగా, ‘ఓటుకు నోటు’ కేసులో హైకోర్ట్ విధించిన స్టేను సవాల్ చేస్తూ… వైసీపీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఈ కేసు విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ… కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ తీర్పుతో వైసీపీ వర్గాలు షాక్ కు గురయ్యాయి. సుప్రీంకోర్టులో అయినా చంద్రబాబును ఇరుకున పెడదామని భావించిన ‘జగన్ అండ్ కో’కు తీవ్ర నిరుత్సాహం తప్పలేదు. దీంతో ఇప్పటివరకు ‘ఓటుకు నోటు కేసు’ వలనే చంద్రబాబు ఇరకాటంలో పడ్డారని ఆరోపణలు చేస్తున్న వైసీపీ వర్గాల వ్యాఖ్యలలో బలం లేదన్న విషయం తేలిపోయింది. గత రెండున్నర్ర సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ, ప్రతిసారి చేదు అనుభవాన్ని చవిచూడడం విశేషం.