alia-bhatt-i-begged-rajamouli-in-the-airportఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్, అలియా భట్ మీద రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్రణయ గీతం చిత్రీకరిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీటిలో నిజం లేదని మనకు ఉన్న సమాచారం.

అలియా భట్ ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు. ఆమె సెప్టెంబర్ లోని షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉండగా, వాయిదా పడింది. వచ్చే నెలలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఐర్లాండ్ కు చెందిన ఒలీవియా మోరిస్ నటిస్తుంది. ఆమె సినిమాలో జెన్నీఫర్ గా నటించబోతుంది.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యిందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. అయితే ఇటీవలే విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఇది వరకు చెప్పిన జులై 30, 2020 రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించకుండా 2020లో ప్రేక్షకుల ముందుకు పది భాషలలో వస్తుందని చెప్పడం గమనార్హం.

దీనితో సినిమా వాయిదా పడుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు డీవీవీ దానయ్య. బాహుబలి తరువాత వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే వాటికి ఏమాత్రం తగ్గదని చిత్ర బృందం అంటుంది.