కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కం చెబుతూ ‘సామజవరగమన’ వీడియో సాంగ్ ప్రోమోని విడుదల చేసింది అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో టీం. అలా విడుదలయ్యిందో లేదో ఇలా వైరల్ అయిపొయింది ఈ ప్రోమో సాంగ్. 59 సెకన్ల నిడివితో రిలీజ్ అయిన ఈ ప్రోమో వావ్ అనిపించేలా ఉంది.
ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టెప్పులు, అందాల భామ పూజా హెగ్డే తళుక్కులు చూసి ఎంజాయ్ చేస్తోంది ప్రేక్షక లోకం. పారిస్లోని అందమైన లొకేషన్స్లో ఈ పాటను చిత్రీకరించారు. అయితే ఈ సాంగ్ నిర్మాణం ఏకంగా ఆరు కోట్లు ఖర్చుపెట్టిందట చిత్ర బృందం. ఈ పాట షూటింగ్ కోసం త్రివిక్రమ్ ఒక పెద్ద బెటాలియన్ నే తీసుకుని వెళ్ళాడట.
వారి ట్రాన్స్ పోర్టు ఖర్చు, అక్కడ ఉండటానికీ దాదాపుగా కోటి రూపాయిలు ఖర్చు అయ్యిందట. మిగతా పాట షూట్ కోసం మరో ఐదు కోట్లు ఖర్చుపెట్టారట. అయితే మొత్తంగా ఆ సాంగ్ ని అక్కడ షూట్ చెయ్యలేదట. కొంత ప్యాచ్ వర్క్ మళ్ళీ హైదరాబాద్ లో చేశారట. దానితో ఈ పాట టాలీవుడ్ లోనే కాస్టలీ సాంగ్ గా నిలిచిందట.
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సూపర్ హిట్ కావడంతో అల వైకుంఠపురంలో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటివరకూ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సినిమా జనవరి 10నే ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అంటున్నారు.