అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అఖిల్కు గత మూడు చిత్రాలు ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయాయి. అఖిల్, హాల్లో, మిస్టర్ మజ్ను సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. అయితే మరో ప్రయత్నంగా తన సత్తాను చాటుకొనేందుకు అఖిల్ అక్కినేని సిద్ధమయ్యాడు. మేలో ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతుంది. ఈలోగా తిరుమల వెళ్లి వచ్చాడు అఖిల్.
తిరుమలను నేను పవిత్ర ప్రదేశంగా భావిస్తాను. అక్కడ నాకు ప్రశాంతత, మానసిక స్థైర్యం లభిస్తుంది. కలియుగ వైకుంఠస్వామిని దర్శించుకొనేందుకు కాలి నడకన బయలు దేరాను. నా ప్రతీ సినిమాకు పాటించినట్టుగానే శ్రీవారిని దర్శించుకొన్నాను. శ్రీవారి దర్శనం తర్వాత నా కొత్త సినిమా ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నాను. పూర్తిస్థాయిలో నా మనసు, హృదయాన్ని సినిమాపై లగ్నం చేస్తాను. గోవిందా.. గోవిందా అంటూ అఖిల్ ట్వీట్ చేశారు.
తీవ్ర ఒడిదుడుకుల ఎదురుకుంటున్న అఖిల్ తన కేరీర్ లో మొదటి బ్రేక్ ఇవ్వమని స్వామిని కోరుకుని ఉంటాడు. చూడాలి స్వామి ఈ సరైన కరుణిస్తాడేమో. బొమ్మరిల్లు తర్వాత భాస్కర్ విజయం కోసం, అలాగే మూడు సినిమాల తర్వాత భారీ సక్సెస్ కోసం పరితపిస్తున్న అఖిల్.. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పటివరకూ అఖిల్ పక్కన చేసే హీరోయిన్ ను ఫైనల్ చెయ్యలేదు. దీనితో హీరోయిన్ అవసరం లేని సీన్లను మొదట చిత్రీకరించబోతుంది చిత్ర బృందం.
Tirumala has always been a place where I’ve found inner peace and strength. Walked up to the hill for a darshanam – a ritual that has become a must for me. I look forward to starting off the new film with a clear and focused mind. Govinda Govinda 🙏🏻
— Akhil Akkineni (@AkhilAkkineni8) July 9, 2019