Sumanth-Reviewsరివ్యూస్ రాస్తారు మీరు..అందుకే ఇలా – అక్కినేని హీరో!అక్కినేని వంశం నుంచి ఫేడ్ అవుట్ అయిపోయాడు అని అనుకుంటున్న హీరోల్లో మన అక్కినేని సుమంత్ ఒకడు. అయితే అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా కుటుంభం అంతా సినిమా వాళ్లే, సొంత కుటుంభంలోనే రెండు బ్యానర్స్ ఉన్నాయి, నాగ్ మద్దతు ఉంది, పైగా అక్కినేని అభిమానుల సపోర్ట్ బలంగా ఉంది కానీ, ఎక్కడో ఏదో తేడా పాపం వరుస సినిమాలతో దూసుకుపోవాల్సిన ఆయన పంచర్ అయిన బండిలా తన కరియర్ ని అలా అలా లాక్కుంటూ వస్తున్నాడు.

ఇదిలా ఉంటే గత ఏడాది “మళ్లీ రావే” సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మంచి సస్పెన్స్ ఉన్న హారర్ థ్రిల్లర్ “సుబ్రమణ్యపురం”లో నటిస్తున్నాడు మన అక్కినేని కుర్రోడు. అయితే , ఈ సినిమాని దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తెరకెక్కిస్తూ ఉండగా, సుమంత్ తో ఈషా రెబ్బా రొమ్యాన్స్ చెయ్యనుంది. ఇక ఏ సినిమా ట్రైయర్ లాంచ్ కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిల్ రావడం ఆకర్షణగా నిలవగా, మరో పక్క సుమంత్ మాట్లాడుతూ, తాను కధను కుర్చీ అంచులో కూర్చుని విన్నాను అని, అంత థ్రిల్లింగ్ గా ఉంటుంది అని, అయితే దర్శకుడు చెప్పిన కధలో 80 శాతం తీసినా చాలు నా సినిమా హిట్ అవుతుంది అని అనుకున్నాను అని, కానీ దర్శకుడు 90 శాతం వరకూ ఈ సినిమాని బాగా తీశాడు అని అన్నాడు.

అదే క్రమంలో మీడియా మిత్రులతో మాట్లాడుతూ అసలు ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం పెట్టడానికి అసలు కారణం ఏంటి అంటే, సింపల్ గా రిలీజ్ చేసేస్తే అందరూ సెల్ ఫోనుల్లో ఈ ట్రైలర్ చూసేసి రివ్యూలు రాస్తారు. అవి సరిగా లేకపోతే ఒక్కోసారి సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతుంది. అందుకే మీ అందరి కోసం కాస్త లేట్ అయినా డోల్బీ ఆడియోలో మీకు ట్రైలర్ చూపించాలి అప్పుడే మీరు ఆ థ్రిల్ ఫీల్ అవుతారు అని ఫీల్ అయ్యీ, మీకు కూడా ఉపయోగపడుతుంది అన్న కోణంలో ఇలా ఈ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

ఇక మీడియా మిత్రులను ఉద్దేశించి ఈ సినిమాకి మీ సపోర్ట్ ఉంటుంది అని, ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అని ఆశిస్తున్నా అంటూ ముగించాడు సుమంత్. మొత్తంగా చూసుకుంటే మీడియాపై తనకున్న నమ్మకాన్ని, అభిమానాన్ని మరో మారు చాటుకున్నాడు సుమంత్.