akhil-akkineni-movie-release-on-22nd-may-2020అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శరవేగంగా ముస్తాబు అవుతుంది. సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలాఖరుకు పూర్తి కావొచ్చని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మధ్యనే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. వేసవి కనుకగా మే 22న ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

అయితే ఈ విడుదల తేదీపై అక్కినేని అభిమానులే పెదవి విరుస్తున్నారు. ఆ రోజున బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ రాధే, హాలీవుడ్ నుండి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 విడుదల అవుతున్నాయి. ఈ రెండు సినిమాల వల్ల మల్టీప్లెక్సలలో, ఓవర్సీస్ లో సినిమాకు సరైన విడుదల దక్కే అవకాశం లేదు. దీనితో ఇది అంత మంచి తేదీ కాదని వారు అంటున్నారు.

2013లో ‘ఒంగోలు గిత్త’ తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్‌ సినిమా చేస్తున్నాడు. కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేని టైం లో భాస్కర్ వంటి అవుట్ అఫ్ ది ఫామ్ దర్శకుడితో నటించడం అంటే సాహసం అనే అనుకోవాలి. ఈ సారైనా అఖిల్ సరైన హిట్ సాధిస్తాడేమో చూడాల్సి ఉంది.

అయితే గీత ఆర్ట్స్ సంస్థకు చెందిన జీఏ2 పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. గత కొంత కాలంగా ఈ సంస్థ హిట్లకు చిరునామాగా మారింది. ఈ సంస్థ భలే భలే మగాడివోయ్ తో నానికి, ప్రతి రోజూ పండగే తో సాయి ధరమ్ తేజ్ కు, గీత గోవిందంతో విజయ్ దేవరకొండకు తమ కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చింది. దీనితో అక్కినేని అభిమానులు ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు.