అల్లు అరవింద్ తెలివిగల వ్యాపారవేత్త అని పిలుస్తారు. ఆయన ఎక్కడ పెట్టుబడి పెట్టాలో బాగా తెలిసిన వ్యక్తి అని ఇండస్ట్రీలో అంతా అంటూ ఉంటారు. ఇప్పుడు, ఆయన అక్కినేని హీరోలపై ఆశలు పెట్టుకున్నట్టుగా ఉన్నారు. అల్లు అరవింద్ అఖిల్ అక్కినేని యొక్క తదుపరి ప్రాజెక్ట్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ను నిర్మిస్తున్నాడు.
తాజాగా ఆయన తన ఆహా యాప్ కోసం నాగ చైతన్య లవ్ స్టోరీ యొక్క డిజిటల్ హక్కులను దక్కించుకున్నారు. లవ్ స్టోరీ ఆహాపై మొదటి పెద్ద చిత్రం. ఆహా సరైన కంటెంట్ లేని కారణంగా ప్రేక్షకులలోకి వెళ్లలేకపోతుంది. లాక్ డౌన్ వంటి అనుకూల సమయంలో కూడా ఈ యాప్ జనాదరణ పొందటానికి ఇబ్బంది పడుతుంది.
నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల ఫామ్ కారణంగా లవ్ స్టోరీ ఈ యాప్లోకి మంచి సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. త్వరలో షూటింగ్లు తిరిగి ప్రారంభిస్తే ఈ చిత్రం దసరా కోసం విడుదలయ్యే అవకాశం ఉంది.ఆలస్యం అయితే గనుక వచ్చే డిసెంబర్ కు వాయిదా పడటం ఖాయం.
ఇకపోతే ఒక నెల షూటింగ్ చేస్తే… అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం షూటింగ్ పూర్తి అవుతుంది. ఈ సినిమా వేసవికి విడుదల చెయ్యాలని తొలుత భావించారు. అయితే లాక్ డౌన్ కారణంగా మొత్తం ప్రణాళిక మారిపోయింది. అంతా అనుకున్నట్టు జరిగితే దసరాకైనా ఈ సినిమా విడుదల చెయ్యాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు.