Adivi Sesh in hit movie sequelవిశ్వక్ సేన్ హీరో న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఈ ఏడాది మొదట్లో వచ్చిన హిట్… కరోనా కు ముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన అతి కొద్ది హిట్లలో హిట్ సినిమా ఒకటి. ఆ సినిమా విడుదలైన నాటి నుండి ఆ సినిమా కు సీక్వెల్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా సీక్వెల్ కు సంబంధించి క్లారిటీ వచ్చింది.

అయితే ఈ సీక్వెల్ లో విశ్వక్ సేన్ నటించడం లేదంట… అతని స్థానంలో అడివి శేష్ హీరోగా ఉంటాడని సమాచారం. చిత్రంలో మిగతాదంతా సేమ్ అంటున్నారు. నాని నిర్మాతగా ఉంటాడు అలాగే హిట్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. వచ్చే ఏడాది మార్చి లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మార్చి నుండి ఈ సినిమా మొదలుపెడతాడు. కేవలం మూడు నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. మరోవైపు మొన్న ఆ మధ్య హిట్ సినిమా బాలీవుడ్ రీమేక్ ని కూడా ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు రాజ్‌కుమార్ రావు నటించనున్నారు.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో దిల్ రాజు నిర్మించనున్నారు. శైలేష్ దానికి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. అయితే ఆ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఆ సినిమా ఎప్పుడు జరుగుతుంది అనేది ఐడియా లేదు. కరోనా కారణంగా ఆ సినిమా వాయిదా పడిందా అనేది తెలియాల్సి ఉంది.