A man was thrashed allegedly for putting tent of #Amaravati protesters, on fire in Tenali ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనం ప్రకారం తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్దనున్న అమరావతి రిలే దీక్ష శిబిరంపై వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కోడిగుడ్లు, టమాటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారట. దీంతో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయని కథనం.

దీక్ష శిబిరం ఎదుట వైసీపీ నేతలు బైక్‌లతో చక్కర్లు కొడుతున్నారట. శిబిరం ఎదుటే చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసి అలజడి సృష్టించారని, శిబిరం ఎదుట మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేసి రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని తెలుస్తుంది.

జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో… ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం, అది కాస్తా తోపులాటకు దారి తీయడంతో… పరిస్థితి ఉద్రిక్తంగా మారిందట. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకూ నచ్చజెప్పే యత్నం చేస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు పదే పదే రైతులను పైడ్ ఆర్టిస్టులు అనడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా రైతులను ఆ విధంగానే చూస్తున్నారు. దీనితో వారు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. దీనితో పల్లెల్లో అలజడులు ఎక్కువగా చెలరేగుతున్నాయి.