Rajamouli - Ram Charan - NTRభారతదేశం గర్వించదగ్గ డైరెక్టర్ రాజమౌళి తన తదుపరి చిత్రంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ను కలిపి ఒక ముల్టీస్టార్ర్ సినిమా చేయనున్నారని అంతటా అనుకుంటున్నారు. ఇటీవలే ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఒకటి రాజమౌళి తన ట్విట్టర్ లో పెట్టడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా దాదాపుగా కంఫర్మ్ అనే అంటున్నారు.

సీనియర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారట. అయితే రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పార్టనర్స్ అట. వారికి పారితోషకం కాకుండా సినిమా లాభాలలో వాటా ఇస్తాడట దానయ్య. ఇలా చెయ్యడం వాళ్ళ ప్రస్తుతం ఆయనకు సినిమా నిర్మాణానికి వెసులుబాటు ఉంటుంది.

అదే సమయంలో వాటా తీసుకునే వారికి కూడా బాగా కిట్టుబాటు అవుతుంది. 2018 రెండవ భాగంలో ఈ సినిమా నిర్మాణం మొదలయ్యి 2019లో విడుదల అవుతుంది. తరాల పాటు ఉప్పు నిప్పులా ఉండే నందమూరి, మెగా అభిమానులను ఈ సినిమా ఒకటి చేస్తుందేమో చూడాలి మరి.