30 crores remuneration for deepika padukoneబాలీవుడ్ భామ దీపికా పదుకోనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన తన తదుపరి చిత్రంలో నటిస్తుంది. మహానటి వంటి అద్భుతమైన సినిమాని ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాపై అప్పుడే స్వల్ప వివాదం మొదలయ్యింది. దీపికా ఒక వెబ్ సైట్ ని ట్విట్టర్ లో కోట్ చేస్తూ దానిని #ప్రభాస్21 అనవద్దు అన్నట్టు చెప్పింది.

సినిమా మీద తన డామినేషన్ చూపించే ప్రయత్నం చేస్తుందని పలువురు భావిస్తున్నారు. దీనితో వారు సోషల్ మీడియాలో పెద్ద రణరంగమే సృష్టిస్తున్నారు. ఈ లోగా దీపికాకి ఈ సినిమాకు ఏకంగా 30 కోట్లు ఇచ్చారని వార్త ఒకటి బయలుదేరింది. బాలీవుడ్‌లో దీపికా పదుకొనే రూ .15 కోట్లు వసూలు చేస్తుంది.

భారీ బ్లాక్ బస్టర్ అయిన భన్సాలీ యొక్క ‘పద్మావత్’ కోసం ఆమె రూ .12 కోట్లు వసూలు చేసింది మరియు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచిన ‘ఛపాక్’ కోసం ఆమె రెమ్యూనరేషన్ రూ .15 కోట్లకు పెంచింది. బాలీవుడ్ సినిమాలకే 15 కోట్లు మించినప్పుడు తెలుగులో 30 కోట్లు ఎలా ఇస్తారు? ఏదో ఇది హైప్ కోసం సృష్టించిన వార్తలా ఉంది.

అక్టోబర్ లో ముహూర్తం జరగబోతుంది… ఏప్రిల్ 2022లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు ఇతర ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ లో ఈ సినిమా మొదలు కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ప్రణాళిక మొత్తం మారిపోయింది. ప్రభాస్ తదుపరి చిత్రం రాధే శ్యామ్ విడుదల వచ్చే ఏడాది మొదటి భాగానికి వాయిదా పడిపోయింది. దీనితో నాగ్ అశ్విన్ మొదలు కావడం ఆలస్యం అవుతుంది. ఎప్పుడు మొదలుపెట్టినా ఏడాది లోగా షూటింగ్ పూర్తి చెయ్యాలని టీం అభిప్రాయం.