భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందా? వచ్చేసారి కూడా ఆయనే ప్రధానిగా కొనసాగాలని కోరుకుంటున్నారా? అంటే అవుననే అంటోంది తాజా సర్వే. ‘2019లో భారతదేశ ప్రధాని’ అనే అంశంపై ‘యూత్ ఆఫ్ ద నేషన్’ పేరుతో నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో మెజారిటీ ప్రజలు తిరిగి మోడీనే పీఎం కావాలని కోరుకున్నట్లు తేలింది.
న్యూస్ యాప్ ఇన్షార్ట్స్, మార్కెటింగ్ ఏజెన్సీ ఇప్సాస్ సంస్థలు సంయుక్తంగా ఈ ఆన్ లైన్ సర్వేను నిర్వహించాయి. 2019లో మోడీనే ప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు 70 శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారు. అలాగే 64 శాతం మంది మహిళలు కూడా మోడీకి జై కొట్టడం విశేషం. ఈ సర్వేలో మొత్తం 63,141 మంది పాల్గొనగా, 70 శాతం మంది మోడీకి జైకొట్టగా 17 శాతం ‘నో’ అన్నారు. 13 శాతం తాము ఇంకా ఏ విషయం తేల్చుకోలేదని సమాధానమిచ్చారు.