Joju George Antonyపప్పన్ అనే ఒక సూపర్ హిట్ సినిమాను సురేష్ గోపి తో కలిసి దర్శకత్వం చేశాక, డైరెక్టర్ జోషి ప్రస్తుతం మరో అద్భుతమైన సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆంటోనీ అనే సినిమాతో డైరెక్టర్ జోషి మరో కొత్త కథను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.

జోజు జార్జ్, ఉష, చెంబన్ వినోద్ జోస్, మరియు విజయ రాఘవన్ వంటి నటీనటులు జోషి ఇంతకుముందు దర్శకత్వం వహించిన బోరింజు మరియు జ్యూస్ అనే సినిమాలు కీలక పాత్రలు పోషించారు. అయితే వారందరూ మరోసారి ఆంటోనీ సినిమాలో కనిపించబోతున్నారు. ఒక కమర్షియల్ డ్రామా గా కాకుండా ఒక ఫీచర్స్ ని బాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ మరియు ఆశ శరత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ జోషి మరియు జోజు జార్జ్ కలిసి చేసిన పోరింజు మరియం జ్యూస్ సినిమా ఈ మధ్యకాలమే విడుదలయ్యి మలయాళం సినిమాలు ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో జోజు పోషించిన కట్టలను పోరింజు అనే పాత్రకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది అనేసరికి ప్రేక్షకులు మరియు ఫాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ మధ్యకాలంలో విడుదలైన ఇరట్ట సినిమా తరువాత జోజు మరోసారి హీరో పాత్రలో ఆంటోనీ సినిమాలో కనిపించబోతున్నారు.

ఐన్‌స్టీన్ మీడియా బ్యానర్‌పై ఐన్‌స్టీన్ జాక్ పాల్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కొచ్చి లోని క్రౌన్ ప్లాజా హోటల్‌లో ఈ సినిమా టైటిల్ లాంచ్ మరియు పూజా కార్యక్రమాలు జరిగాయి