సింహా, లెజెండ్ వంటి సూపర్డూపర్ హిట్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేవలం ఒకే ఒక్క షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న తరువాత కోవిడ్ ప్రభావంతో ఆగిపోయింది.
తాజాగా ఈరోజు హైదరాబాద్లో ఈ సినిమా రీస్టార్ట్ అయ్యింది. ప్రభుత్వం సూచించిన కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇబ్రహీంపట్నం లో ఒక కాలేజీ లో షూటింగ్ జరుగుతుంది. ఈ షూట్ అయిపోయాకా రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ అవుతారు. ఆ షెడ్యూల్ లో హీరోయిన్ ప్రగ్య మార్టిన్ కూడా ఎంటర్ అవుతుంది.
డిసెంబర్ మొదటి వారం వరకు ఏకధాటిగా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని మరో హీరోయిన్ పేరు ఇంకా ఖరారు కాలేదు. ఈ ఏడాదిలో దసరాకు విడుదల కావలసిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి గానీ విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. వచ్చే ఏడాది మొదట్లో విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ వస్తుంది.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత కంపోజర్. ఇంతకుముందు ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని పుకార్లు ఉన్నాయి. బోయపాటికి సరైనోడు తరువాత హిట్ లేదు. దీనితో ఈ సినిమా హిట్ కావడం ఆయనకు కూడా కీలకం. అలాగే బాలయ్య కూడా గత ఏడాది వరుసగా మూడు ప్లాపులతో ఫ్యాన్స్ కు భాకీ ఉన్నాడు.