ys sharmila-YS Jaganవైసీపీ కార్యకలాపాలకు వైయస్ జగన్ సోదరి షర్మిల దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రాజ్యసభ సీటు విషయంలో అన్నా – చెల్లెల్ల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, దీంతో పార్టీకి దూరంగా షర్మిల ఉంటున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో గత కొన్నాళ్ళుగా జరుగుతున్న విషయం విజ్ఞులకు తెలిసిందే. అయితే, ఇది తాత్కాలిక దూరం కాదు, అసలు పార్టీ నుండి షర్మిల దూరం కానుంది అంటున్నారు ఏపీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి.

విజయనగరంలో పర్యటించిన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేసిన సమాచార శాఖ మంత్రి పల్లె… వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని, అయితే ఎమ్మెల్యేలే కాదు, జగన్ సోదరి షర్మిల కూడా వైసీపీని వీడుతారని సంచలన వ్యాఖ్యలు చేసారు. స్వయంగా మంత్రే ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కేవలం విమర్శల్లో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసారా… లేక మంత్రి గారి వద్ద సమగ్రమైన సమాచారం ఉందా అన్న రీతిలో మొదలైన చర్చలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా జరుగుతున్నాయి.