rana in marketమన తెలుగు సినిమా హీరోలు మారుతున్నారు. ఒక్క సినిమాల కధల విషయంలోనే కాదు, సామాన్య ప్రజలతో కలిసిపోయే విషయంలోనూ నవతరం హీరోల ఎంట్రీతో మార్పు స్పష్టంగా కనపడుతోంది. ఒకప్పుడు ప్రచారం అంటే మైలు దూరం పరిగెత్తే హీరోలు ప్రస్తుతం బాలీవుడ్ హీరోల మాదిరి ప్రజలతో కలిసిపోయి వింత వింత పనులన్నీ చేస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే… రానా, అఖిల్ ల తాజా ఉదంతాలు.

ఒక రైతుబజార్ వద్ద కూలీ అవతారం ఎత్తాడు దగ్గుపాటి రానా. క్యాబేజీ కట్టల కూరగాయల మూటను వెన్నుకెత్తుకుని దర్శనమిస్తున్న ఫోటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇతడే తాజా “కూలీ నెం.1” అంటూ నెటిజన్లు కూడా కితబిస్తున్నారు.

మరోవైపు అక్కినేని నట వారసుడు అఖిల్ తానేమీ తక్కువ కాదన్నట్లు ఆటో డ్రైవర్ అవతారం చాలించారు. పేషంట్లను, విధ్యార్ధులను ఆటోలో ఎక్కించుకుని డబ్బులు సంపాదించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఓ రేంజ్ లో సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

అద్దాల మేడలలో, ఎ.సిల నడుమ జీవనం సాగించే ఇలాంటి సినీ సెలబ్రిటీలంతా ఇలా రోడ్లపైకి వచ్చి సందడి చేయడం సామాన్య ప్రజలకు ఒక వింత అనుభూతినే పంచుతోంది. అయితే ఇదంతా మంచు లక్ష్మీ రూపొందిస్తున్న “మేము సైతం” కార్యక్రమంలో భాగంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయలు అమ్ముతూ చేసిన సందడి నెటిజన్లకు విదితమే.