posani krishna muraliవెండితెరపై కనిపించే నటీనటులు రీల్ లైఫ్ లో చాలా సార్లు పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కి ఉంటారు. అయితే రియల్ లైఫ్ లో మాత్రం అలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే అది ఒక హాట్ హాట్ న్యూసే మరి. ఇటీవల కాలంలో ఎప్పుడూ ఏదొక వివాదంతో హల్చల్ చేస్తున్న టాలీవుడ్ నటీనటుల జాబితాలోకి పోసాని కృష్ణమురళీ కూడా చేరిపోయారు.

రాజా… అంటూ ముద్దుగా పిలిచే పోసాని, హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి నరేష్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేసాడు. డబ్బులు కావాలి అంటూ సదరు వ్యక్తి తనను వేధిస్తున్నాడని, దానికి అంగీకరించకపోవడంతో నోటికి వచ్చినట్లు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడని, వాటిని భరించలేక ఫిర్యాదు చేస్తున్నానని, తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు కోరినట్లు తెలుస్తోంది. పోసాని ఫిర్యాదుకు స్పందించి, సదరు వ్యక్తితో మాట్లాడతామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

సినీ రచయితగా కెరీర్ ఆరంభించిన పోసాని కృష్ణ మురళీ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రధాన నటులలో ఒకరు. కమెడియన్ నుండి క్యారెక్టర్ ఆరిస్ట్ పాత్రల వరకు పోషిస్తున్న పోసానిపై ఎలాంటి వివాదాలు లేవు. అలాగే వ్యక్తిగతంగా కూడా మంచి వాడన్న పేరును ఇండస్ట్రీ వర్గాలలో వినపడుతూ ఉంటుంది. మరి అలాంటి పోసాని పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఫిర్యాదు చేసేటంత అవసరం ఎమోచ్చిందా అన్న ఆసక్తి నెలకొంది.