పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా ఏప్రిల్ 8వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ అభిమానులంతా పండగ చేసుకునే ఇదే రోజున ప్రిన్స్ ఫ్యాన్స్ కూడా సందడి చేయడానికి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది.
మిక్కీ జే మేయర్ స్వరపరిచిన “బ్రహ్మోత్సవం” సినిమా పాటల పండుగను ఏప్రిల్ 8వ తేదీన జరపాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా ప్రింట్ మీడియాలో హల్చల్ చేసున్న అంశం. ఏప్రిల్ మొదటి వారంలో (8వ తేదీన) ఆడియోను, చివరి వారంలో (29వ తేదీన) సినిమాను విడుదల చేయాలని ప్లానింగ్ జరుగుతోందట.
విజయవాడ నేపధ్యంలో జరగబోతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, పివిపి సంస్థ నిర్మిస్తోంది. కాజల్, సమంత, ప్రణితలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మరో 30 మంది ప్రధాన నటులు కీలక పాత్ర పోషించనున్నారు.