mahesh-to-launch-trailer-of-kshanamఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ద్వారా అందరిని ఆకర్షించిన బుల్లితెర భామ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “క్షణం.” ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పివిపి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అడవి శేష్, ఆదా శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనపడనున్నారు. రవికాంత్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ రాబోతోంది.

ఎందుకంటే… ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను ఫిబ్రవరి 10వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు, ‘కుందనపు బొమ్మ’ సమంత విడుదల చేయనున్నారు. సాధారణంగా ఇతర సినిమాల ఈవెంట్లకు హాజరుకాని మహేష్, ఈ సినిమా ట్రైలర్ విడుదలకు రావడం పట్ల సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుతం మహేష్ నటిస్తున్న “బ్రహ్మోత్సవం” సినిమాను నిర్మిస్తోంది కూడా పివిపి సంస్థే కావడంతో, “క్షణం” వేడుకకు ప్రిన్స్ విచ్చేస్తున్నారు.

అయితే ప్రిన్స్ రాకతో ఈ సినిమాకు కావలసినంత పబ్లిసిటీ దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘జబర్ధస్త్’ బ్యూటీ అనసూయ ప్రిన్స్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.