Brahmotsavam online promotionsశ్రీకాంత్ అడ్డాల – ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్లో రూపుదిద్దుకుంటున్న “బ్రహ్మోత్సవం” ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న యూనిట్, తాజాగా ఫ్రెష్ టీజర్ ను విడుదల చేసి అభిమానులకు మరింత ఊపు తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేయడంతో ప్రిన్స్ అభిమానులంతా ఆ టీజర్ కోసం వేచి చూస్తున్నారు.

ప్రిన్స్ ఫ్యాన్స్… మీ ఊపిరి బిగపట్టే ‘మధురం మధురం’ టీజర్ మే 1వ తేదీనాడు పలకరించనుంది… వెయిట్ చేయండి… అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసిన కాసేపటికి దీనిపై ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ట్వీట్ ‘మధురం మధురం’ టీజర్ పై అంచనాలను పెంచేసింది. ‘బ్రహ్మోత్సవం’లోని ‘మధురం మధురం’ అనే టీజర్ తన కెరీర్ లోనే బెస్ట్ అని, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని ప్రిన్స్ చేసిన ట్వీట్ తో ఫ్యాన్స్ లో మరింత ఉత్సుకత నెలకొంది. తాజా పరిణామాలతో సోషల్ మీడియాలో మరోసారి ప్రిన్స్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది.