reasons behind tdp leaders joined trsఅధికార టీఆర్ఎస్ పార్టీలోకి తెలుగుదేశం నేతల వలసల వెల్లువ కొనసాగుతూనే ఉంది. నేడు పార్టీ కండువా మార్చిన వివేక్ నుండి గతంలో ‘గులాభీ’ కండువా కప్పుకున్న టిడిపి వారినందరినీ రకరకాల ప్రలోభాలతో కేసీఆర్ లొంగదీసుకున్నారని తెలంగాణా తెలుగుదేశం వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఎవరిని ఏ ప్రలోభంతో లొంగతీసుకున్నారో కూడా రేవంత్ వివరించారు.

మాధవరం కృష్ణారావు – స్థలం వివాదంలో భయపెట్టి
ధర్మారెడ్డి – కాంట్రాక్టుల పేరుతో
తీగల కృష్ణారెడ్డి – కాలేజీల పేరుతో
వివేకానందరెడ్డి – వ్యక్తిగత కుటుంబ తగాదాలు, అక్రం కట్టడం గొడవతో బెదిరించడం

తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలనే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, పార్టీ మారకపోతే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యేల మెడపై కత్తిపెట్టి లొంగదీసుకుంటున్నారని, టీఆర్ఎస్ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వాదులు మానసిక రోగులుగా మారుతున్నారని, ఈ వ్యవహారాలను ఖండించాలని, ఇకనైనా పార్టీ పిరాయింపులపై పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని రేవంత్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించుకుంటూ పోతే, కేసీఆర్ కుటుంబంలో ఏదో ఒక రోజు ముసలం పుట్టడం ఖాయమని, దాంతో భవిష్యత్తులో మీరు కూడా అవే ఫిరాయింపులకు బలవుతారని రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు.