దర్శకుడు శ్రీనువైట్ల బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్తో హ్యాట్రిక్ కొట్టడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు జంకుతున్నారు. ‘దూకుడు’ చిత్రం సక్సెస్ తర్వాత ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘బాద్షా’, ‘ఆగడు’, ‘బ్రూస్లీ’ చిత్రాలు ఫ్లాప్ అయిన విషయం తెల్సిందే. ఈ మూడు చిత్రాలు కూడా విడుదలకు ముందు భారీ క్రేజ్ను తెచ్చుకున్నాయి. కాని ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి. దాంతో ఈయన కెరీర్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సక్సెస్ కొట్టి తీరాల్సిందే. డూ ఆర్ డై పొజీషన్లో ఉన్న శ్రీనువైట్ల ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
మహేష్, ఎన్టీఆర్, రామ్చరణ్ వంటి స్టార్స్తో సినిమాలు తీసిన శ్రీనువైట్ల వరుస ఫ్లాప్లతో మళ్లీ చిన్న హీరోతో సినిమా చేసే పరిస్థితి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం రామ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘రెడీ’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ సక్సెస్ను అందుకుంది. ఆ నమ్మకంతోనే మళ్లీ శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించేందుకు రామ్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. రామ్ కెరీర్ కూడా పెద్దగా ఆశాజనకంగా ఏమీ లేదు. దాంతో ఈ సమయంలో రామ్ సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. ఒకవేళ ఈ సాహసం సక్సెస్ అయితే రామ్ కెరీర్ మరో అయిదు సంవత్సరాలు ఎలాంటి ఢోకా లేకుండా ముందుకు సాగుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. రామ్తో సక్సెస్ కొడితే మళ్లీ స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం శ్రీనువైట్లకు వస్తుంది. మొత్తానికి వీరి కాంబోలో మూవీ ఇద్దరికి కూడా చాలా ముఖ్యం.