నిఖిల్, నందిత జంటగా తెరకెక్కిన ‘శంకరాభరణం’ చిత్రం వచ్చే నెల 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం ఇదే నెలలో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఇతర సినిమాలు ఉండటం వల్ల డిసెంబర్కు వాయిదా వేశారు. డిసెంబర్లో ఒంటరిగా రావాలనుకున్న నిఖిల్కు వర్మ రూపంలో షాక్ ఎదురైంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తాజాగా తెరకెక్కించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రాన్ని అదే తేదీకి విడుదల చేయాలని నిర్ణయించుకుని ‘శంకరాభరణం’కు షాక్ ఇచ్చాడు.
వివాదాస్పద సబ్జెక్ట్లను తనదైన శైలిలో తెరకెక్కించడంలో వర్మకు ఎప్పుడైనా మంచి మార్కులే పడతాయి. ఈయన గతంలో పలు రియల్ స్టోరీలను వెండి తెరపై ఆవిష్కరించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈసారి వీరప్పన్ గురించి తెరకెక్కించి మరోసారి సక్సెస్ కొట్టాలని తహ తహ లాడుతున్నాడు. అయితే గత కొంత కాలంగా వర్మకు సక్సెస్లు లేవు. దాంతో ఈ సినిమాపై కూడా అనుమానాలు ఉన్నాయి. కాని ప్రేక్షకుల్లో మాత్రం వీరప్పన్ గురించి తెలుసుకోవాలనే తపన ఉంది. దాంతో ‘కిల్లింగ్ వీరప్పన్’కు తప్పకుండా మంచి కలెక్షన్స్ వస్తాయని అంటున్నారు. అందుకే ‘శంకరాభరణం’ను పాపం అంటున్నారు. వర్మ సినిమాతో నిఖిల్ సినిమా పోటీ పడుతుందా లేదా అనేది చూడాలి.